हिन्दी | Epaper

ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి : కేటీఆర్..!

sumalatha chinthakayala
ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి : కేటీఆర్..!

హైదరాబాద్‌: ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిని రక్షించడం అసాధ్యమన్నారు.

image

ఈ క్రమంలోనే ఉప ఎన్నికలను ఫేస్ చేసేందుకు బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేటీఆర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద వేసిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870