हिन्दी | Epaper

KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

Sai Kiran
KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

KTR Formula E race : ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఈ వారంలోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం. చార్జిషీట్‌లో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదు చేసిన ఈ కేసులో విచారణ దాదాపు పూర్తయింది. చార్జిషీట్‌కు తుదిరూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి కోసం ఎదురుచూశారు. తాజాగా ఆ అనుమతి రావడంతో చార్జిషీట్ దాఖలు ప్రక్రియ వేగవంతమైంది. కేసుకు సంబంధించి ఎలక్ట్రానిక్, డిజిటల్ ఆధారాలను కూడా సేకరించినట్లు సమాచారం.

Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

KTR Formula E race
KTR Formula E race

ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ వల్ల హెచ్‌ఎండీఏకు సుమారు ₹75.88 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ పేర్కొంటోంది. రేసు నిర్వహణ బాధ్యతలు ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థకు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు వచ్చాయనే అంశాన్ని కూడా దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది.

ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గతంలోనే అనుమతి ఇచ్చారు. 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్, అర్వింద్ కుమార్ తదితరులను విచారించారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత తదుపరి చర్యలు ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870