हिन्दी | Epaper

మాదాపూర్‌లో అగ్ని ప్ర‌మాదం

sumalatha chinthakayala
మాదాపూర్‌లో అగ్ని ప్ర‌మాదం

హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఒక ఐటీ కంపెనీలో ఎగిసిపడిన మంటలు చుట్టుపక్కల వారిని షాక్ కు గురి చేశాయి. ఐటీ కారిడార్ కు గుండెకాయ లాంటి మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వా మల్టీస్టోరెడ్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి.

ఈ భారీ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్ష్యులు ఇస్తున్న ప్రాధమిక సమాచారం ప్రకారం సత్వా భవనంలో ఒక్కసారి మంటలు రేగటంతో భయాందోళనలకు గురైన ఉద్యోగులు పలువురు బయటకు పరుగులు తీసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. అయితే.. భారీ ఆస్తినష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.

అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్నంతనే అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకొని.. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటన్నరకు మంటలు అదుపులోకి వచ్చినట్లుగా చెబుతున్నారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మున్సిపల్ తదితర శాఖలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. భారీగా మంటలుచెలరేగటంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఐటీ కారిడార్ లో కీలకమైన ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం కారణంగా పలు ఐటీ సంస్థలకు ఆపరేషన్ ఇబ్బందులు తలెత్తే వీలుందని చెబుతున్నారు. ఎందుకుంటే..సత్వా భవనంలో పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడా భవనంలో నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలు రోజువారీ కార్యకలాపాల్ని ఎలా చేపడతారన్నది ప్రశ్నగా మారింది. ఈ అగ్నిప్రమాదం కొత్త సందేహాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. భారీగా కట్టేసిన భవనాల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే.. వాటిని సమర్థంగా నిలువరించే వ్యవస్థ లేదన్న విమర్శ వినిపిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870