తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరించేందుకు కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్ల సేవల కోసం ‘ఫామ్’(FarmApp) అనే కొత్త యాప్ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Read Also: Reliance: త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

ఈ యాప్ ద్వారా రైతులు ట్రాక్టర్లు, రోటవేటర్లు, హార్వెస్టర్లు వంటి యంత్రాలను అవసరాన్ని బట్టి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బుకింగ్ పూర్తయిన తర్వాత సేవల ప్రదాతలు నేరుగా రైతుల పొలాలకు చేరుకొని వ్యవసాయ పనులను నిర్వహించనున్నారు. దీంతో యంత్రాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన సమస్య తగ్గనుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ‘యుటిలైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్’ కార్యక్రమం ద్వారా డ్రోన్ ఆధారిత పంటల పర్యవేక్షణ, మందుల పిచికారీ సేవలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇదే తరహా డిజిటల్ వ్యవసాయ సేవలు అమలులోకి వస్తే, రైతుల పనితీరు వేగవంతమై ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది. నూతన యాప్(FarmApp) ద్వారా సేవల ధరలు, అందుబాటు సమయం, యంత్రాల వివరాలు వంటి సమాచారాన్ని రైతులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సేవల ట్రాకింగ్, ఫీడ్బ్యాక్ వ్యవస్థలను కూడా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా వ్యవసాయ సేవల రంగంలో పారదర్శకత, నాణ్యత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: