हिन्दी | Epaper

ఈటల రాజేందర్‌ హౌజ్ అరెస్టు

sumalatha chinthakayala
ఈటల రాజేందర్‌ హౌజ్ అరెస్టు

హైదరాబాద్‌: ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇటీవల ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు.

బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870