మెజారిటీ మునిసిపాలిటీలపై
బిజెపి కన్ను
ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి నియామకం
హైదరాబాద్ : అత్యధిక మున్సిపాలిటీలను(Elections) కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ సుడిగాలి ప్రచారం నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగింది. ఈ ఎన్నికల్లో 7 కార్పోరేషన్లకు గాను అయిదింటిలో, 116 మున్సిపాలిటీలకు గాను ఏడింటిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ముందుండి నడిపించింది.
Read Also:DeputyCM Bhatti: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామా బాద్, రామగుండం, మహబూబ్నగర్ కార్పోరేషన్లలో గెలుపుపై బీజేపీ ధీమాతో ఉంది. వాస్తవానికి పార్ల మెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా వాటిని పక్కనపెట్టి మరీ బీజేపీ ఎంపీలు తమ ఎంపీ సెగ్మెం ట్లలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించి ప్రచారపర్వాన్ని కొనసాగిం చారు. అదేవిధంగా ఆదిలాబాద్, భైంసా, కోరుట్ల, గద్వాల, మక్తల్, నారాయణపేట, భూత్పూర్, ఆమ నగల్లు, ఆత్మకూరు, కామారెడ్డి, భువనగిరి, వేములవాడ, జనగామ, సూర్యాపేట, నిర్మల్ తదితర మున్సి పల్ ఛైర్మన్ పీఠాలను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇలాఖలోని కరీంనగర్ కార్పోరేషన్తోపాటు ఆ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని(Elections) మున్సిపాలిటీల్లో గెలుపుపై బీజేపీ పూర్తి ధీమాతో ఉంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీల మధ్య త్రిముఖ పోరు ఉండగా ఎక్స్అఫీషియో సభ్యుల బలంతో మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్నారు. మహబూబ్నగర్ కార్పోరేషనన్నూ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఎంపీ డీకే. అరుణ ఉన్నారు. ఇన్ని రోజులు ఆమె మహబూబ్నగర్లోనే మకాం వేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిద్యంవహిస్తున్న కార్పోరే షన్లు, మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: