हिन्दी | Epaper

EAPCET: తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

Sharanya
EAPCET: తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

తెలంగాణలో EAPCET (Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) 2025 ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 11 ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల విడుదలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు అధికారిక ప్రారంభం అయ్యింది.

పరీక్షా తేదీలు & హాజరైన విద్యార్థులు

ఈ సంవత్సరం TG EAPCET పరీక్షలు ఏప్రిల్ 29, 30, మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ మరియు ఫార్మా విభాగాల పరీక్షలు, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU), హైదరాబాద్ యాజమాన్యంలో నిర్వహించారు. ఈసారి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

ఇంజినీరింగ్ విభాగంలో టాపర్లు ?

ఇంజినీరింగ్ విభాగంలో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీ పురానికి చెందిన పల్లా భరత్ చంద్ర 150.058 మార్కులతో రాష్ట్ర టాపర్ గా నిలిచాడు. ఆదివాసీల జిల్లా నుంచి వచ్చిన విద్యార్థి తెలంగాణ టాపర్ గా నిలవడంతో అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లికి చెందిన ఉడగండ్ల రామ చరణ్ రెడ్డి 148.284 మార్కులతో రెండో స్థానంలో నిలిచాడు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ 147.085 మార్కులతో మూడో ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ నాచారంకు చెందిన లక్ష్మీ భార్గవ్ మెండే నాలుగో ర్యాంకు, శేరిలింగంపల్లికి చెందిన మంత్రిరెడ్డి వెంకట గణేశ్ రాయల్ ఐదో ర్యాంకు సాధించాడు.

అగ్రికల్చర్ విభాగంలో టాపర్లు

అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్‌కు చెందిన సాకేత్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచాడు. అతను 141.688 మార్కులతో టాప్ ర్యాంకు సాధించాడు. రెండో స్థానంలో కరీంనగర్ జిల్లాలోని వావిళ్ల రామ్ రెడ్డి నగర్కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యా ఉన్నాడు, అతని మార్కులు 140.477. మూడో ర్యాంకు వరంగల్‌కు చెందిన చంద్ర అక్షిత్ దక్కించుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన పెద్దింటి రచ్చల సాయినంద్ కు నాలుగో ర్యాంకు వచ్చింది. మాదాపుర్ కు చెందిన బ్రాహ్మణి రెండ్లకు ఐదో ర్యాంకు వచ్చింది.

అధికారిక వెబ్‌సైట్‌లో

విద్యార్థులు తమ TG EAPCET ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ( https://eapcet.tgche.ac.in/ ) చూసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల షీట్‌తో పాటు ర్యాంక్ కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల తర్వాత విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం సిద్ధంగా ఉండాలి. షెడ్యూల్, వెబ్ ఆప్షన్స్, సీటు కేటాయింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివరాలు త్వరలో అధికారికంగా విడుదలకానున్నాయి.

Read also: UGC NET: యూజీసీ నెట్ జూన్‌ 2025 దరఖాస్తు గడువు పెంపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870