తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రముఖ ఆచార్య జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన, పీవీ నరసింహారావు పశువైద్య విద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ బీఎస్సీ వ్యవసాయం, బీఎస్సీ ఉద్యాన, బీటెక్ వ్యవసాయ ఇంజినీరింగ్, బీటెక్ ఆహార సాంకేతికత, బీఎస్సీ హోంసైన్స్, బీఎఫ్ఎస్సీ, బీవీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం(మే30న) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి మే 31 ఉదయం 10 గంటల నుంచి జూన్ 28 సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశానికి అర్హత:
ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా EAPCET-2025 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) లో అర్హత సాధించి ఉండాలి.
ప్రవేశాల కొరకు కోర్సుల వివరాలు:
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU):
వ్యవసాయ వర్సిటీ పరిధిలోని ఏడు బీఎస్సీ వ్యవసాయ కళాశాలల్లో 615 సాధారణ సీట్లు, 365 సెల్ఫ్ఫైనాన్స్(ఎస్ఎఫ్) సీట్లు
బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో 38 సాధారణ, 5 ఎస్ఎఫ్ సీట్లు
బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 25 సాధారణ, 5 ఎస్ఎఫ్ సీట్లు
ఉద్యాన వర్సిటీ పరిధిలో మూడు కళాశాలల్లో 200 సాధారణ, 34 ఎస్ఎఫ్ సీట్లు ఉన్నాయి.
పశువైద్య వర్సిటీ పరిధిలోని మూడు పశువైద్య కళాశాలల్లో 185 సాధారణ, 15 ఎస్ఎఫ్ సీట్లు, ఫిషరీ సైన్స్ కళాశాలలో 28 సీట్లు భర్తీ అవుతాయి.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద గత పదేళ్లుగా 85 శాతం స్థానికులకు, 15 శాతం ఏపీ విద్యార్థులకు కోటా ఉండగా, ఈసారి మొత్తం సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణను ఈ ప్రవేశాల్లో తొలిసారిగా అమలు చేయనున్నారు.
ప్రత్యేక కోటాలు – పేద, రైతు కుటుంబాల విద్యార్థులకు అవకాశం:
ఈసారి ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా రైతు కుటుంబాలకు, పేదవర్గాల విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక కోటాలు ఏర్పాటు చేశారు.
భూమిలేని వ్యవసాయ కూలీలకు 15% సీట్లు – విద్యార్థికి లేదా తల్లిదండ్రులకు జాబ్ కార్డ్ ఉండాలి. 4వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలలో కనీసం 4 సంవత్సరాలు చదివి ఉండాలి. భూమిలేదని తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం అవసరం.
- రైతు కుటుంబాలకు ప్రత్యేక కోటా –
- ఉద్యాన వర్సిటీ పరిధిలో 40 శాతం సీట్లను, వ్యవసాయ, పశువైద్య వర్సిటీల పరిధిలో 25 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాల విద్యార్థులకు కేటాయిస్తారు.
విద్యార్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ www.pjtsau.edu.in సందర్శించాలి.
Read also: Accident: 45 అడుగులపై నుంచి కారు బోల్తా అయినా ప్రాణాలు దక్కాయి