విద్యార్థులకు దసరా పండుగ సెలవుల్ని ప్రకటించారు. ఇంకేమీ ఉంది సొంత ఊర్లకు ఇప్పటికే అనేకులు బయలుదేరారు. కానీ దొంగలకు ఇదే మహాభాగ్యం..అందివచ్చిన అవకాశం. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి మారణాయుధాలతో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది.ముఖాలకు ముసుగులు, చేతుల్లో కత్తులు వంటి మారణాయుధాలతో ఆరు ఇళ్లల్లోని బంగారం, వెండి ఆభరణాలను, నగదును దోచుకెళ్లారు. ఎనిమిదిమంది ముఠాగా వచ్చిన దొంగలు పండుగకు ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసారు దొంగలు. సీసీ కెమెరాలు, ఇంట్లో ఉన్న మనుషులు ఉన్నా సైలెంట్గా దోపిడీ(Robbery) చేశారు.
ముసుగులు ఆపై కత్తులతో దోపిడి
దొంగలు కత్తులు పట్టుకుని, ముసుగులు ధరించారని తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే చోరీ చేసిన కొన్ని వస్తువులను దొంగలు బయట పడేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో(CC Camera) రికార్డయిన దృశ్యాలు చూసి.. ఖమ్మం నగర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని, దొంగల్ని పట్టుకోవాలని, మళ్లీ ఇలాంటి దోపిడీ దొంగలు చొరబడకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఖమ్మంలో ఎక్కడ దోపిడీ జరిగింది?
అందినకాడి వద్ద దుకాణాలు, గృహాల నుంచి దోపిడీ జరిగింది.
దొంగలు ఏం దోచుకెళ్లారు?
నగదు, విలువైన వస్తువులు మరియు వ్యక్తిగత సరఫరా దోచుకెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: