KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి బడా స్కామ్ బయటపెడతానని అన్నారు. హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాలే కాదు.. దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని త్వరలో భారీ స్కామ్ బయటపెడతానన్నారు. ఇందులో ఓ బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.

మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారు
రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే..మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి వదులుదామనుకున్న బాంబులు తుస్సుమన్నయ్.. అందుకే సైలెంట్ అయిపోయాడని విమర్శించారు.
కేసీఆర్పై కోపంతో నీళ్లు వదిలేశారు
గోదావరి, కృష్ణా జలాల్లో విచ్చలవిడి జలదోపిడీ జరుగుతోంది. భూకంపం, భారీ వరద వచ్చినా మేడిగడ్డ చెక్కు చెదరలేదు. కేసీఆర్పై కోపంతో నీళ్లు వదిలేశారు. పంటలు ఎండుతున్నాయి. ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారుగా పెట్టుకున్నారు. ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఏపీ తరపున వాదించారు. ఆదిత్యనాథ్ దాస్ నియామకం ఏపీ ప్రయోజనాల కోసమా..? ఏపీ, చంద్రబాబు కోసమే ఆదిత్యనాథ్ను నియమించారా..? కృష్ణాలో అన్ని జలాశయాలు నిండాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.