హైదరాబాద్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు(Tummala Nageswararao) విజప్తి చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని ఐసీఏఆర్(ICAR) భారత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రాంగణంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆన్ మిల్లెట్స్ కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Sivarajsingh Chouhan), సహాయమంత్రి భగీరథ్చౌదరి శంకుస్థాపన చేశారు. ఇందులో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రం సమర్పిం చారు. గతంలో హైదరాబాద్ కార్యాలయంగా కొబ్బరి బోర్డు కార్యాలయం ఉండేదని, కాని విభజన అనంతరం అది విజయవాడకు తరలించబడిందని తెలిపారు. దీంతో రాష్ట్ర రైతులు సకాలంలో సేవలు అందుకోలేక పోతున్నారని అందువల్ల కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

కేవలం రూ.135 కోట్లు మాత్రమే విడుదల
అలాగే ఆయిల్ పామ్ సాగుకు నాణ్యమైన విత్తనాల ఎంపెనెల్మెంట్ కోసం కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ఆయిల్ పామ్ గెలల టన్ను కనిష్ఠ మద్దతు ధర రూ.25 వేలుగా నిర్ణ యించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, నీటి మోటార్లు, కార్మికుల వేతనాలు, యంత్రాల వినియోగం, నిర్వహణ తదితర వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో ధరలను స్థిరీకరించాలని చెప్పారు. ఇర ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షి ంచాలని సూచించారు. ఇక హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు, పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. దీనికోసం రూ.1,823.20 కోట్లతో ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పించామని, అయితే ఇప్పటివరకు కేవలం రూ.135 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, మిగిలిన సొమ్మును మంజూరు చేయాలని వినతిపత్రంలో కేంద్ర మంత్రిని కోరారు.
Read Also: Congress: తెలంగాణలో 96మంది నేతలకు కీలక పదవులను కేటాయించిన కాంగ్రెస్