తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే, పనితీరు మందగించిన అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామసభల వేదికగా ప్రజలకు వివరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పులు, మధ్యాహ్న భోజన బిల్లుల సకాలంలో చెల్లింపు, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!
అయితే, కొందరు కలెక్టర్ల బాధ్యతారాహిత్యంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో నివాసం ఉండకుండా, ప్రజలకు అందుబాటులో లేని అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. “జిల్లా కలెక్టర్లు అంటే అక్కడే ఉండి ప్రజల సమస్యలు వినాలి.. అలా లేని వారిని సహించేది లేదు” అని రేవంత్ రెడ్డి కఠినంగా హెచ్చరించారు. రాబోయే 99 రోజుల పాటు కలెక్టర్లు ఎవరూ తమ పరిధిని దాటి వెళ్లకూడదని, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. పద్ధతి మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం ద్వారా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :