हिन्दी | Epaper

మెదక్ జిల్లాలో చిరుత కలకలం

Uday Kumar
మెదక్ జిల్లాలో చిరుత కలకలం

పెద్ద శంకరంపేట..

మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్కులలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామునే అదే గ్రామానికి చెందిన ఒక రైతు పొలం వద్ద ఉన్న లేగదూడపై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని ధ్రువీకరించారు. గ్రామస్తులు రాత్రి వేల ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్దకు వెళ్లాలంటే గుంపులుగా కలిసి వెళ్లాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870