YS Jagan meeting : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddyను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. రాజకీయ భేదాలకు అతీతంగా ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని వర్గాలు తెలిపాయి.
Read Also: Iran Israel War: దుబాయ్లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

కాగా, భట్టివిక్రమార్క తన కుమారుడి వివాహానికి పలు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanలను కూడా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: