हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Bhatti Vikramarka: సింగరేణి విష ప్రచారం పై భట్టి ఆగ్రహం

Saritha
Bhatti Vikramarka: సింగరేణి విష ప్రచారం పై భట్టి ఆగ్రహం

సింగరేణి ఆస్తులను కొంతమందికి కట్టబెట్టే ప్లాన్ తో, కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా విషపు రాతలు రాస్తున్నారంటూ తెలంగాణ (TG) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషపు రాతల వల్ల రాష్ట్రానికి, సింగరేణికి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఈరోజు ఉదయం ప్రజాభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణిపై అసత్య ప్రచారాల వెనక కుట్ర దాగి ఉందని, సింగరేణి ఆస్తులు కాజేసే ప్లాన్ ఉందని ఆరోపించారు.

Read Also: Telangana: ఘనంగా ముగిసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల పిటిఎం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు వెల్లడి

(Bhatti Vikramarka) టెండర్లపై అపోహలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం తప్పుడు రాతలు రాస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాబందుల నుంచి సింగరేణి ఆస్తులను కాపాడతానని ఆయన చెప్పారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాయడాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ జరిపిస్తానని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిపై కిషన్ రెడ్డి పరిశీలిస్తేనే నిజాలు బయటపడతాయని చెప్పారు.

Bhatti Vikramarka: సింగరేణి విష ప్రచారం పై భట్టి ఆగ్రహం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పినట్లుగా, కోల్ ఇండియా టెండర్ 2018లో కేంద్రం తయారు చేసిందే, సైట్ విజిట్ తప్పనిసరి నిబంధన అప్పట్లోనే ఉంది. 2021లో కూడా కేంద్ర గనుల శాఖ అదే నిర్ధారించింది. అయితే, పత్రికలు, నాయకులు, సోషల్ మీడియాలో భట్టి విక్రమార్క సూచనలవల్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870