Bhatti: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థుల కోసం పెద్ద నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka) ఆదేశించారు. మొత్తం రూ.303 కోట్ల నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించగా, ఈ నిధులతో సుమారు 2,288 మంది విద్యార్థులకు బకాయిలు చెల్లించనున్నారు. ఒక్కో విద్యార్థికి సగటున రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సమాచారం. ఇకపై స్కాలర్షిప్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన, సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Read also: Azharuddin: అజారుద్దీన్కు మంత్రి పదవి… ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Bhatti: విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్
Bhatti: ప్రజాభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల కారణంగా విద్యార్థులు విదేశాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ముఖ్యంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో పెరిగిన ఖర్చులు విద్యార్థులపై భారమయ్యాయని చెప్పారు. నిధుల విడుదలతో విద్యార్థులు తమ చదువును నిరంతరంగా కొనసాగించడానికి వీలవుతుందని, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఈసారి ఆర్థిక శాఖ అధికారులు ఒకేసారి అన్ని ఫైళ్లను క్లియర్ చేయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ సిస్టమ్లోకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: