हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

BC Welfare : బిసిలకు పెద్దపీట వేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే

Shravan
BC Welfare : బిసిలకు పెద్దపీట వేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు

హైదరాబాద్ : దేశంలో చిత్తశుద్ధితో బిసిల సంక్షేమం కోసం పనిచేస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు (N.Ram chandar rao) అన్నారు. మోడీ ప్రభుత్వం కేబినెట్లో 27 మంది బిసి మంత్రులు ఉన్నారని తెలిపారు. బిసిలకు (BC) పెద్దపీట వేసింది… బిసి కమిషన్ న్ను తీసుకువచ్చింది కూడా మోడీ అని, రాహుల్ గాంధీ మాత్రం బిసిని అవమానపరిచేలా కన్వర్టెడ్ బిసి అంటూ విమర్శించడం దారుణం అన్నారు. బిసి జాబితాలు రాష్ట్రానికొకటిగా ఉండవని, రాష్ట్రాన్నిబట్టి జాబితాలు మారుతాయి. ఉదాహరణకు లంబాడాలు మన రాష్ట్రంలో ఎస్జీలు.. కానీ మహారాష్ట్రలో బిసిలు… నేను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కెసిఆర్ ఈ కమిషన్ ను ఏర్పాటు చేసినప్పటికీ, దానికి అవసరమైన నిధులు మాత్రం కేటాయించలేదు. కమిషన్కు కేవలం హోదా ఇచ్చారు గానీ, పనితీరుకు అవసరమైన ఆర్థిక మద్దతు కల్పించలేదన్నారు. ఇక కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేపట్టిన కుల గణన విషయానికొస్తే, అది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాదు, ఆ గణన కేవలం గణాంకాల సేకరణ మాత్రమే. ఎందుకంటే, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థల ద్వారా కాకుండా, ప్రభుత్వమే స్వయంగా నిర్వహిం చిన ప్రక్రియ. కులగణనకు సంబంధించి వివరా లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బయట పెట్టక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మండలాల స్థాయిలో కులగణన చేయలేదని అనేకమంది టీచర్లు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలను బయట పెట్టే ఉద్దేశం కనబడడం లేదు. కులగణనన అధికారికంగా చేయాలంటే, అది రాజ్యాంగ బద్ధమైన సంస్థలతో, సరైన డేటా ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదన్నారు. విశ్వకర యోజన, ముద్రా రుణాలు, స్టార్టప్ ఇండియా వంటి వివిధ పథకాలలో అధికంగా లబ్దిదారులు బిసిలే కావడం స్పష్టంగా కనిపిస్తుం దన్నారు. ఈ వాస్తవం మోడీ ప్రభుత్వం బిసిల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న విషయాని నిరూపిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబిసిల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తుందన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Cultural Movement : బిసిల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870