ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh),తన మాట తీరు, ఉత్సాహం, వినూత్న వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలిచే ఈ వ్యక్తి, సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున సక్రియంగా పనిచేసిన బండ్ల గణేష్, ఆ సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బండ్లన్న చేసిన బ్లేడ్ కామెంట్స్ పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
Read Also: Ravi Teja: సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను పట్టించుకోను: రవితేజ
అయితే ఇప్పుడు మళ్లీ బండ్ల గణేష్ పేరు వార్తల్లో నిలిచారు.ఈ ప్రభుత్వంలో పౌల్ట్రీ రైతులకు మేలు జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి బండ్ల గణేష్ తాజాగా థాంక్స్ చెప్పారు.షాద్ నగర్ పరిధిలోని పౌల్ట్రీ రైతులకు సంబంధించిన రూ.5.5 కోట్ల ఆస్తిపన్నును తెలంగాణ గవర్నమెంట్ రద్దు చేసిందని బండ్ల గణేష్ (Bandla Ganesh)తెలిపారు.

అందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యేకి, రేవంత్ రెడ్డి కి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ”షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి పౌల్ట్రీ రైతులకు సంబంధించిన ఆస్తిపన్ను రూ. 5.5 కోట్లకు పైగా బకాయి రద్దు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి కృతజ్ఞతలు” అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. దీనికి రేవంత్ ని ట్యాగ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: