తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. రాష్ట్రానికి రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించినట్లు వెల్లడించింది. లోక్సభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ 2.0 పథకం (AMRUT 2.0) కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు తెలిపారు.
తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్ (Etela Rajender), చామల కిరణ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నలకు తోఖాన్ సాహు బదులిస్తూ, తెలంగాణలో రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
Read Also: TG Environment: హైదరాబాద్లో ఊపిరాడకుండా చేస్తున్న కాలుష్యం

కేంద్రం ఆమోదించిన (AMRUT 2.0) ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు సీవేజ్/సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటికి గాను రూ. 3,949.10 కోట్లు కేటాయించగా, కేంద్రం తన వాటాగా రూ. 2,788.03 కోట్లు అందిస్తుంది. దీనితో పాటు నిజాం నగలను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి హైదరాబాద్లోనే మరో ప్రాంతానికి మార్చే అంశంపై కేంద్రం మంత్రి కీలక ప్రకటన చేశారు.
అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో మొత్తం 252 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి మొత్తం విలువ రూ. 9,584 కోట్లు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే మూడు సీవేజ్/సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల విలువ రూ. 3,949.10 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 2,788.03 కోట్లు అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: