Amanagal Municipality Chairman Election: ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఆ పార్టీ కౌన్సిలర్ నేనావత్ పత్యనాయక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 15 కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియ ఓటు పోలింగ్ నిర్వహించారు. పత్తి నాయక్ అభ్యర్థిత్వాన్ని బిజెపి ప్రతిపాదించగా కాంగ్రెస్ బలపరిచింది. బి ఆర్ ఎస్ పార్టీ తరఫున 5 వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము పేరును ఆ పార్టీ ప్రతిపాదించి బలపరిచింది.
Read Also: TG Municipal elections: మహబూబ్నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..

ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు చేతులు ఎత్తే విధానంలో ఎన్నికలు నిర్వహించగా 9 మంది (బిజెపి 6, కాంగ్రెస్ 2, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో 1) పద్య నాయక్ అనుకూలంగా ఓటు వేశారు. అటు బి ఆర్ ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి పాపిశెట్టి రాముకు 7 ఓట్లు పోలయ్యాయి. దీంతో పత్య నాయక్ రెండు ఓట్ల తేడాతో నెగ్గి చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. అనంతరం వైస్ చైర్మన్ పదవి కి మూడవ వార్డు అభ్యర్థి తల్లోజు గీత ఆచారి పేరును ప్రతిపాదించగా బిజెపి కాంగ్రెస్ కౌన్సిలర్లు అనుకూల ఓట్లతో నెగ్గారు. దీంతో కాంగ్రెస్, బిజెపి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షతిరేకం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: