
Amanagallu Jatara: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో వేడుకగా జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో ఊహించని ప్రమాదం సంభవించింది. జాతరలో భాగంగా నిర్వహించే అత్యంత కీలకమైన నిప్పుల గుండం ప్రవేశం కార్యక్రమంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకుని నిప్పుల గుండం దాటే క్రమంలో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో ఈ అపశృతి జరిగింది.
Read Also: Summer 2026: పెరుగుతున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
తోపులాటతో చెలరేగిన గందరగోళం.. 10 మందికి తీవ్ర గాయాలు
నిప్పుల గుండం దాటుతున్న సమయంలో వెనుక నుంచి భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి సుమారు 10 మంది భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. మండుతున్న నిప్పుల మధ్య పడటంతో భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతర ప్రాంగణంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు అప్రమత్తమై నిప్పుల్లో పడిపోతున్నవారిని బయటికి లాగి, గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: