దేశంలో కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క యూపీఐ (UPI) సేవల్లో ఈ రోజు పెద్ద అంతరాయం చోటుచేసుకుంది. బ్యాంక్ కస్టమర్లు లావాదేవీలు విఫలమవుతున్నాయని, డబ్బు ట్రాన్స్ఫర్ కావడం లేదని సోషల్ మీడియాలో విస్తృతంగా రిపోర్ట్ చేశారు. పేమెంట్ ఫెయిల్, ట్రాన్సాక్షన్ టైమ్ అవుట్ , అమౌంట్ డెబిట్ అయి క్రెడిట్ కాలేదు వంటి సమస్యలను అనేక మంది ఎదుర్కొన్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా SBI అకౌంట్లలో లావాదేవీలు జరగడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News: AP Weather : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు
ఈ నేపథ్యంలో SBI అధికారికంగా స్పందించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో, “టెక్నికల్ కారణాల వల్ల ప్రస్తుతం UPI సేవల్లో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. మా టెక్నికల్ బృందం సమస్య పరిష్కారంపై పని చేస్తోంది. రాత్రి 8 గంటలలోగా సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తాం” అని పేర్కొంది. అయితే ఆ సమయానికీ సేవలు పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడంతో కస్టమర్లు సోషల్ మీడియాలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం ఉన్నా, ఇలాంటి సమస్యలు తరచూ వస్తే నమ్మకం తగ్గుతుంది” అని పలువురు వినియోగదారులు వ్యాఖ్యానించారు.

టెక్నికల్ నిపుణులు చెబుతున్నదేమిటంటే ..SBI యూపీఐ ట్రాఫిక్ దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉండటంతో, సర్వర్ లోడ్ సమస్యలు తరచూ తలెత్తే అవకాశం ఉంది. యూపీఐ వ్యవస్థపై ఆధారపడి రోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే క్రమంలో చిన్న గ్లిచ్ కూడా పెద్ద ఎఫెక్ట్ చూపుతుంది. RBI మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు తమ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిరంతరం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం SBI సమస్య పరిష్కారానికి కృషి చేస్తుండగా, యూపీఐ వినియోగదారులు తాత్కాలికంగా ఇతర బ్యాంకింగ్ మార్గాలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/