టెక్నాలజీలో కొత్త ప్రగతులు సాధిస్తున్న చైనా, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మరో ఆవిష్కరణ చేసింది. సముద్ర గర్భంలోనే AI ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేసి, ప్రపంచంలో తొలిసారి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేసింది. హాంకాంగ్కు ఆగ్నేయ దిశలోని లింగ్ షుయి తీరంలో ఈ డేటా సెంటర్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్లో డేటా మేనేజ్మెంట్, ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీలకు కొత్త మార్గదర్శకత్వం లభించనుంది.
అత్యాధునిక సౌకర్యాలతో హైపెర్ఫార్మెన్స్
ఈ సముద్ర డేటా సెంటర్లో 400 హైపెర్ఫార్మెన్స్ సర్వర్లు ఏర్పాటు చేయబడినాయి. వీటి నిర్వహణ కోసం అధునాతన కూలింగ్ సిస్టమ్ను వినియోగించారు. సముద్రపు చల్లని నీటిని ఉపయోగించి, సర్వర్ల ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఇది సంప్రదాయ డేటా సెంటర్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం, అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది.

ప్రసిద్ధమైన AI ప్రాసెసింగ్ కేంద్రం
ఈ డేటా సెంటర్ ప్రతి సెకనుకు 7,000 AI ప్రశ్నలను ప్రాసెస్ చేయగలదు. పారిశ్రామిక రంగం, మెరైన్ రీసెర్చ్, సైన్స్, హై టెక్ డెవలప్మెంట్ వంటి అనేక విభాగాలకు ఇది ఉపయోగపడనుంది. సముద్ర గర్భంలో ఉండటం వల్ల భద్రతా పరంగా ఇది మరింత ప్రయోజనకరం అవుతుంది. డేటా లీకేజీ, హ్యాకింగ్ వంటి ప్రమాదాలు తగ్గే అవకాశముంది.
భవిష్యత్లో మరిన్ని ప్రాజెక్టులు
చైనా ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ను ఒక ప్రాథమిక అంకంగా మాత్రమే చూస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సముద్ర డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ, తక్కువ వ్యయం, అధిక సామర్థ్యం అనే లక్ష్యాలతో డేటా స్టోరేజ్, ప్రాసెసింగ్లో కొత్త ఒరవడి సృష్టించనుంది. ఇదే విధంగా కొనసాగితే, ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా సముద్ర గర్భ డేటా సెంటర్ల వైపు దృష్టి పెట్టే అవకాశముంది.