AI workplace stress: సాంకేతికత పెరిగితే మనిషి పని భారం తగ్గుతుందని అందరూ భావించారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా టెక్ దిగ్గజ సంస్థల్లో ఏఐ (AI) ప్రవేశం తర్వాత ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్
ఏఐ 75 శాతం పని చేస్తున్నా తప్పని తిప్పలు
ప్రస్తుతం ఆఫీసుల్లో దాదాపు 75 శాతం పనులను ఏఐ పూర్తి చేస్తోంది.. అయినప్పటికీ, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గకపోగా ఐదు రెట్లు పెరిగిందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గతంలో ఒక రోజు పట్టే పనిని ఇప్పుడు గంటల్లోనే కోరుతుండటంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నిర్ణయాధికారంతో పెరుగుతున్న మానసిక భారం
పనిని పూర్తి చేసే బాధ్యతను ఏఐ తీసుకున్నప్పటికీ, తుది నిర్ణయాలు తీసుకోవడం (Decision Making) ఏఐ ఇచ్చిన అవుట్పుట్ను సరిచూడటం మనిషిపైనే పడుతోంది. దీనివల్ల ఉద్యోగులు నిరంతరం ఆలోచించాల్సి వస్తోంది. కేవలం శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరగడం వల్ల ‘బర్న్ అవుట్’ (Burnout) సమస్యలు ఎదురవుతున్నాయి. టెక్ కంపెనీల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
నిపుణుల హెచ్చరిక: ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
కంపెనీలు కేవలం అవుట్పుట్ మరియు ఉత్పాదకతపైనే కాకుండా, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం (Mental Health) పై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని వాడుకుంటూనే, ఉద్యోగులకు తగిన విశ్రాంతి, మానసిక ప్రశాంతత కల్పించేలా పని గంటలను సరిదిద్దాలని వారు అభిప్రాయపడుతున్నారు. లేదంటే దీర్ఘకాలంలో ఇది సంస్థల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: