జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (Tata Chandra Shekhar) స్పందించారు. ఎయిర్ ఇండియా నిర్వహణ టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో, ప్రమాదానికి సంబంధించిన ఆందోళనలపై ఆయన వివరాలు వెల్లడించారు. ప్రజల్లో వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ, అసలు కారణాలపై తుదిగుర్తింపు అవసరమని చెప్పారు.
ఇంజిన్ల పనితీరు పై స్పష్టత
చంద్రశేఖరన్ మాట్లాడుతూ, “విమానానికి ఉన్న రెండు ఇంజిన్లలో ఒకటి కొత్తది. రైట్ ఇంజిన్ను 2025 మార్చిలోనే కొత్తగా అమర్చాం. లెఫ్ట్ ఇంజిన్ను 2023లో సర్వీస్ చేశాం. తదుపరి సర్వీసు 2025 డిసెంబర్లో జరగాల్సి ఉంది. అటువంటి మంచి పనితీరుతో ఉన్న ఇంజిన్లను కేవలం ఫెయిలయ్యాయన్న అభిప్రాయం అర్థరహితం,” అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, విమానానికి సంబంధించి ఏవైనా యాంత్రిక లోపాలు ఉన్నాయా? లేక ఇతర కారణాల వల్లే ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
ఊహాగానాలు అవసరం లేదు
వాస్తవిక నివేదిక వెలువడే వరకు అనవసర ఊహాగానాలపై ప్రజలు నమ్మకంతో ఉండకూడదని చంద్రశేఖరన్ విజ్ఞప్తి చేశారు. టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా మానవ ప్రాణాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, భద్రతా ప్రమాణాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, డీజీసీఏ సంయుక్తంగా తద్వారా కారణాలను తేల్చే దిశగా విచారణ కొనసాగుతోంది.
Read Also : Karnataka : డెయిరీ బ్రాండ్లపై మరోసారి కర్ణాటకలో రాజకీయ వేడి