త్రిభాషా విధానం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించగా, తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఒక్క హిందీ వల్లే ఉత్తర భారతదేశంలోని 25 భాషలు కనుమరుగు అయ్యాయి. తమిళనాడుకు ఆ పరిస్థితి రానివ్వం” అని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం
జాతీయ విద్యా విధానంలో 2020 భాగంగా కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు హిందీ, ఇంగ్లీషుతో పాటు తమ ప్రాంతీయ భాషను నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు ఉంటాయని కేంద్రం చెబుతోంది. భాషలు ఎక్కువ నేర్చుకోవడం విద్యార్థులకు లాభదాయకమని బీజేపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటాం
కేంద్రం విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. “తమిళ విద్యార్థులు ఇబ్బంది పడకుండా, ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటాం” అని స్టాలిన్ స్పష్టం చేశారు. “మనకు తగిన భాషలను నేర్చుకోవడం తప్పనిసరి చేయడం అప్రజాస్వామికం” అని ఆయన పేర్కొన్నారు.
స్టాలిన్ ఆరోపణలు
తాజాగా ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
“గత 100 ఏళ్లలో హిందీ వల్ల 25 భాషలు పూర్తిగా అదృశ్యమయ్యాయి” అని ఆరోపించారు.
భోజ్పురి, మైథిలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్గఢి, సంథాలీ, అంజికా వంటి భాషలు ఇప్పుడు పూర్తిగా నశించిపోతున్నాయని తెలిపారు.
“ఉత్తర ప్రదేశ్, బీహార్ అసలు భాషలు హిందీలో కలిసిపోయాయి. తమిళనాడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొనదని మేము త్రిభాషా విధానాన్ని అంగీకరించట్లేదు” అని తేల్చి చెప్పారు.
“భాషలపై దాడి జరగడం జాతి, సంస్కృతిని నాశనం చేయడమే” అని మండిపడ్డారు.
బీజేపీ నేతలు స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ తమిళనాడు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు.తమిళనాడులోనే స్టాలిన్ కుటుంబ సభ్యులు నడిపే పాఠశాలల్లో హిందీ మూడో భాషగా ఉంది అని ఆరోపిస్తున్నారు.ఈయన చెప్పే మాటలు నమ్మొద్దు అంటూనే కామెంట్లు చేస్తున్నారు.
భవిష్యత్తు
తమిళనాడు త్రిభాషా విధానాన్ని అంగీకరించదు అనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.కేంద్రం మాత్రం విద్యార్థులకు అన్ని భాషలు నేర్చుకోవడం అవసరమే అని చెబుతోంది.ఈ అంశంపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు జరిగే అవకాశముంది.ఈ వివాదం 2026 ఎన్నికల్లో కీలక రాజకీయ అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.భాషా విధానం పై కేంద్రం – తమిళనాడు మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. స్టాలిన్ చేసిన “హిందీ వల్ల 25 భాషలు కనుమరుగయ్యాయి” అనే వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపగా, బీజేపీ మాత్రం విద్యార్థులు అన్ని భాషలు నేర్చుకోవాలని అదే మంచిదని చెబుతోంది. భవిష్యత్తులో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.