హరియాణా ఫలితాలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాక్గా మారాయి. ఈ ఫలితాలను తాము అంగీకరించమని, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని…