మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

Supreme Court: మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

ఏదయినా అన్యాయం జరిగితే కొంతకాలం పోరాడి, న్యాయం జరగకపోతే ఇక న్యాయం జరగదని వదిలేస్తాం. కానీ ఓ కుటుంబం మాత్రం కామాంధుడికి శిక్ష పడేంతవరకు పోరాడింది. 40 ఏళ్ల క్రితం ఆమె ఓ చిన్నారి. ఆ సమయంలో ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్లింది. ఆ కోర్టు ఈ కోర్టు అంటూ ఆ బాలిక తల్లిదండ్రులు నిందితుడికి శిక్షపడాలని, తమ చిన్నారిపై అత్యాచారం చేసిన వాడికి చట్టం తప్పకుండా శిక్షిస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని నమ్మి.. ఏకంగా 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. 1986లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి శిక్ష విధించాలని ఆదేశించింది.

మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

కేసు పూర్తి వివరాలు
రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ బాలికపై 1986లో 21 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. నవంబర్ 1987లో ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, ట్రైయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు తనపై జరిగిన నేరం గురించి ఏమీ చెప్పలేదు. ఈ ఆధారాలతో శిక్ష విధించలేమంటూ రాజస్థాన్‌ హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును పక్కన పెట్టిన కోర్టు
బాధితురాలు మైనర్‌, ఆమె మౌనాన్ని పెద్దల మౌనంతో సమానంగా చూడలేం. తనపై జరిగిన దారుణం నుంచి ఉద్భవించిన మౌనం అయిఉండొచ్చు. మొత్తం ప్రాసిక్యూషన్ భారాన్ని ఆమె చిన్న భుజాలపై మోపడం అన్యాయం” అని న్యాయమూర్తులు అన్నారు. నిందితుడు ఇప్పటికే శిక్ష అనుభవించకపోతే, ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అనుభవించడానికి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.

Related Posts
కొనసాగుతున్న భోపాల్ గ్యాస్ వ్యర్థాల తొలగింపు
gas leak

భోపాల్ లో 40 ఏళ్ళ క్రితం జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన వేదన ఇంకా వెంటాడుతున్నది. నిద్రలోనే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దేశాన్ని ఉలిక్కిపడేలా Read more

Posani : పోసానికి ఊరట బెయిల్ మంజూరు
Posani : పోసానికి ఊరట బెయిల్ మంజూరు

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత Read more

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి
Road accident in America. Five Indians died

రోడ్డు ప్రమాదాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇవి ప్రమాదకరమైన పరిస్థితులు, మరణాలు, గాయాలు, ఆర్థిక నష్టం మరియు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Read more

మహారాష్ట్ర విజయం తరువాత, ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తలకు ప్రసంగించేందుకు సిద్ధం..
MODI AT BJP HEADQUATERS

మహారాష్ట్రలో ఘనమైన విజయం సాధించిన అనంతరం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంలో, పార్టీ కార్యకర్తలకు ఆయన ప్రసంగించేందుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *