2015లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.426ని సమర్థిస్తూ హైకోర్టు 2019 సెప్టెంబర్ 27న ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆ జీవో ఆధారంగా మళ్లీ టెండర్లు పిలవడంతో పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ అధికారులు తప్పు తెలుసుకొని టెండర్లను ముందే ఉపసంహరించుకున్నారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఈ జీవో ప్రకారం, ఆలయ పరిసరాల్లోని దుకాణాల నిర్వహణకు పిలిచే టెండర్లలో హిందూేతరులను అనుమతించకూడదని స్పష్టంగా పేర్కొనబడింది.పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర అధికారులు పదే పదే ఇలాంటి టెండర్లు జారీ చేస్తున్నారని, మూడో సారి ఇలాంటి పొరపాటు చేసినందున భవిష్యత్తులో ఇలా జరగకుండా స్పష్టత నివ్వాలని కోరారు. దీంతో 2020 ఫిబ్రవరి 27న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అది కొనసాగుతుందని, జీవో 426 అమలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

జీవో 426
అయితే, స్టే ఉన్నప్పటికీ శ్రీశైలం దేవస్థానం అధికారులు జీవో 426ను ఆధారంగా తీసుకుని మళ్లీ టెండర్లు పిలిచారు. దీనిపై కొన్ని వ్యాపార సంఘాలు, దుకాణదారులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దేవాదాయ శాఖ అధికారులు తమ తప్పును తెలుసుకొని ఆ టెండర్లను ఉపసంహరించుకున్నారని కోర్టుకు తెలిపారు.అయితే, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ, ప్రభుత్వ అధికారులు పదేపదే ఇదే విధమైన టెండర్లను జారీచేస్తూ స్టే ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు మూడో సారి ఇలాంటి పొరపాటు జరగకుండా భవిష్యత్తులో ఇలా చేయకుండా స్పష్టత నివ్వాలని కోరారు.
2020లో విధించిన స్టే
అంతేగాక, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2020లో విధించిన స్టే ఇప్పటికీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీవో 426 అమలు చేయరాదని మరోసారి తేల్చిచెప్పింది.015లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెం.426ను జారీ చేసింది, ఇది హిందూ దేవాలయాల ప్రాంగణాల్లోని దుకాణాల నిర్వహణకు సంబంధించిన టెండర్లలో హిందూయేతరుల పాల్గొనడాన్ని నిషేధించింది. ఈ జీవోను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి, అయితే 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ జీవోను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరిలో హైకోర్టు తీర్పుపై స్టే విధించింది, తద్వారా జీవో 426 అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ స్టే ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.