నౌహీరా షేక్‌‌కు సుప్రీంకోర్టు బిగ్ వార్నింగ్

నౌహీరా షేక్‌‌కు సుప్రీంకోర్టు బిగ్ వార్నింగ్

పలు స్కీమ్‌ల పేరుతో రూ.వేలకోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించి.. మోసగించిన హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌కు సర్వోన్నత న్యాయస్థానం రెండు ఆప్షన్లు ఇచ్చింది. మూడు నెలల్లోగా డిపాజిటర్ల నుంచి సేకరించిన రూ.25 కోట్లను చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. లక్షలాది మంది నుంచి పలు స్కీమ్‌ల పేరుతో రూ.5,600 కోట్లు వసూలుచేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో బుధవారం నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాదితుల నుంచి సేకరించిన రూ.25 కోట్లను 90 రోజుల్లోగా నౌషెరా షేక్ తిరిగి ఇవ్వకుంటే కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ఈడీ)ని ఆదేశించింది.

నౌహీరా షేక్‌‌కు సుప్రీంకోర్టు బిగ్ వార్నింగ్


ధర్మాసనం హెచ్చరిక
లొంగిపోయే గడువు పొడిగించిన నవంబర్ 11, 2024 నుంచి కోర్టు వెలువరించిన ఆదేశాలను నిందితురాలు వరుసగా ధిక్కరిస్తున్నారని, ఆమె రూ. 25 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘మూడు నెలల్లోగా డిపాజిటర్ల సొమ్ము రూ.25 కోట్లు తిరిగి చెల్లించాలి.. నిందితులకు ఇదే చివరి అవకాశం.. అలా కాకుంటే బెయిల్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.. ఈడీ జైలుకు పంపుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. నౌషెరా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఆమె వద్ద డబ్బులేదని చెప్పారు. అయితే, షేక్ పేరును ఉన్న అనేక ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. కానీ, వేలానికి ఇబ్బందులు లేని ఆస్తుల జాబితాను ఇవ్వాలని ఆమె న్యాయవాది కోరితే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తన పేరుతో కేవలం మూడు ఆస్తులే ఉన్నాయని వివరాలు సమర్పించిన షేక్.. వాటిలోని తెలంగాణలోని రెండింటిని ఈడీ వేలం వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
నమ్మించి నిలువునా ముంచేశారు
ఇక, హీరా గోల్డ్ కేసులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) విచారణ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు చోట్ల ఈ కేసులో పెండింగ్‌లో ఉన్నారు. నగలు, బంగారం స్కీమ్‌లు పేరుతో డబ్బులు వసూలు చేసి.. పెట్టుబడికి 36 శాతం డివిడెంట్ ఇస్తామని నమ్మించి నిలువునా ముంచేశారు. ప్రారంభించిన కొత్తలో డివిడెండ్ చెల్లించి.. భారీగా డిపాజిట్లు సేకరించిన తర్వాత బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదుకాగా.. అక్టోబరు 2018లో నౌషెరా షేక్‌ను అరెస్ట్ చేశారు.

Related Posts
Delhi Government : మరో ప్రాంతానికి తరలిపోనున్న తీహార్ జైలు
Delhi Government మరో ప్రాంతానికి తరలిపోనున్న తీహార్ జైలు

Delhi Government : మరో ప్రాంతానికి తరలిపోనున్న తీహార్ జైలు ఆసియాలోనే అత్యంత పెద్ద జైలుగా పేరుగాంచిన తీహార్ జైలులో ఖైదీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కరడుగట్టిన Read more

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించిన ఆప్
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించిన ఆప్

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ అంచనాలను పూర్తిగా తిరస్కరించింది. Read more

జార్ఖండ్ బైపోల్ ఎన్నికలు: ఆర్జేడీ 5 సీట్లలో ఆధిక్యం సాధించింది..
RJD

2024 జార్ఖండ్ అసెంబ్లీ బైపోల్ ఎన్నికల ఫలితాల్లో, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆకట్టుకుంటూ ఐదు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ రోజు వోట్ల లెక్కింపు ప్రకారం, Read more

అస్వస్థతకు గురైన ధంకర్ ఆస్పత్రికి తరలింపు
అస్వస్థతకు గురైన ధంకర్ ఆస్పత్రికి తరలింపు

అస్వస్థతకు గురైన ధంకర్ ఆస్పత్రికి తరలింపు తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం కారణంగా ఆయనను అర్ధరాత్రి అత్యవసరంగా ఢిల్లీ Read more