ధనవంతులు, సంపన్నుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ కాస్త ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే ఎంత సంపాదించిన లేదా ఎంత సంపాదన ఉన్నసరే ఇప్పటికి కొందరు సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మన దేశంలో అత్యంత ధనవంతుల మహిళల పేర్లు చూస్తే అందులో సుధా మూర్తి అనే పేరు తప్పక ఉంటుంది.
సామాజిక సేవలకు ఫెమస్
సుధా మూర్తి సింప్లిసిటీకి, సామాజిక సేవలకు ఫెమస్. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఆమె సాధారణంగానే ఉంటుంది. ఆమె వయస్సు 74. సుధా మూర్తి దంపతులు ఇద్దరు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు… అవును, మీరు సుధా మూర్తిని చూసి, ఆమె ఒక ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త భార్యా అని, ఆమె అల్లుడు ఒక దేశ ప్రధానమంత్రి అని ఎవరూ చెప్పలేరు. అంతే కాదు ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా.

ఒక్క నిర్ణయంతో ఒక్క చీర కూడా కొనలేదు
DNA నివేదిక ప్రకారం, కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ సుధా మూర్తి మూడు దశాబ్దాలుగా ఒక్క కొత్త చీర కూడా కొనలేదు. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉండోచ్చు. అయితే దీని వెనుక ఒక ఆధ్యాత్మిక నమ్మకం ఉందని సుధా మూర్తి వాదిస్తున్నారు. నిజానికి ఆమె కాశీ వెళ్ళినపుడు ఆమె తనకు ఇష్టమైనదాన్ని వదిలి వెళ్లాలని అనుకుంది. ఆమెకు చీరలంటే చాలా ఇష్టం, అప్పటి నుండి ఆమె కొత్త చీరలు కొనలేదని సమాచారం. కాశీకి వెళ్ళినప్పుడు సుధా మూర్తి తనకు ఇష్టమైన వస్తువును విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని వినయానికి చిహ్నంగా తీసుకుంది.
అత్యంత ధనవంతుల లిస్టులో 69వ స్థానంలో నారాయణ మూర్తి
ఎన్.ఆర్. నారాయణ మూర్తి: సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్కు మరో సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో 69వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం సంపద $5.2 బిలియన్లు. 1981 నుండి 2002 వరకు అంటే 21 ఏళ్ళు ఇన్ఫోసిస్ CEOగా ఉన్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షత బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ను వివాహం చేసుకుంది.
సుధా మూర్తికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
మైసూర్ విశ్వవిద్యాలయం 105వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమంలో సుధా మూర్తి సేవలకు గుర్తింపుగా ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. జీవితంలో చాలా సింపుల్ లైఫ్ గడపడం కొంతమందిని చూసి ఎలా నేర్చుకోవచ్చో చెప్పడానికి ఆమె ఒక మంచి ఉదాహరణ. సుధా మూర్తి 2023లో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించారు. రాజ్యసభలో ఆమె ఉనికి మన ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శనం, సుధా మూర్తి సేవలు ఇంకా ఆమె కృషి మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళల బలం అండ్ సామర్థ్యాన్ని వివరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Xలో షేర్ చేసారు.