Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

Read Time:  1 min
Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి
FONT SIZE
GET APP

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పరిధిలోని గోశాలలో గోవులు పెద్ద ఎత్తున మృతి చెందిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు, జరుగుతున్నాయి.

భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

టీటీడీ మాజీ ఛైర్మన్ మరియు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశాన్ని మొదట బయటపెట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోశాలలో అనేక గోవులు మృతి చెందినట్లు వెల్లడించారు. గోవుల మరణానికి సంబంధించిన పోస్టుమార్టం జరగలేదని, ఇది పాలకుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నదని అన్నారు. గోశాల నిర్వహణ బాధ్యత డీఎఫ్ఓ స్థాయి అధికారికి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా విస్మయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందన

ఈ వివాదంపై బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. తనకు ఈ విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ద్వారా తెలిసిందని చెప్పారు.  దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తానని తెలిపారు. గోశాలకు ఎటువంటి సంబంధం లేని డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారని, దీనిపై విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. భూమన ఆరోపణలను పలువురు మంత్రులు ఖండించడంతో పాటు ఆయనపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Read also: Purandeshwari : ముస్లింల ఓటు దుష్ప్రచారం చేస్తున్నారు: పురందేశ్వరి

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.