हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Stalin: తమిళనాడు ‘స్వయంప్రతిపత్తి’ కోసం స్టాలిన్ నిర్ణయం

Vanipushpa
Stalin: తమిళనాడు ‘స్వయంప్రతిపత్తి’ కోసం స్టాలిన్ నిర్ణయం

గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు స్వయంప్రతిపత్తి కోసం చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర హక్కులను కేంద్రం క్రమంగా లాక్కుంటోందని ఆరోపించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్ర స్వయంప్రతిపత్తిని నిర్ధారిస్తుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని వివరంగా పరిశీలిస్తుంది. జనవరి 2026లో తన మధ్యంతర నివేదికను సమర్పిస్తుంది. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం. నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. సిఫార్సులతో కూడిన తుది నివేదికను ఈ కమిటీ రెండేళ్లలో సమర్పించనున్నట్లు స్టాలిన్ తెలిపారు.

తమిళనాడు 'స్వయంప్రతిపత్తి' కోసం స్టాలిన్ నిర్ణయం

నీట్ పరీక్ష, త్రిభాషా విధానంపై విమర్శలు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ కమిటీ పరిశోధన చేసి సిఫార్సులు చేస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. అలాగే నీట్ పరీక్ష, త్రిభాషా విధానంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. నీట్ కారణంగా చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. నీట్ పరీక్షను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటామని తెలిపారు.
హిందీని బలవంతంగా రుద్దడాన్నీ వెతిరేకిస్తున్న స్టాలిన్
త్రిభాషా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడు సర్కార్ జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందున, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ. 2500 కోట్లు నిధులను ఆపేసిందని విమర్శించారు. విద్యను ఉమ్మడి జాబితాకు మార్చడానికి అనుమతించే 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర జాబితాలో విద్య ఉండాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ వర్సెస్ తమిళనాడు సర్కార్
బిల్లుల ఆమోదంపై గవర్నర్‌, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో స్టాలిన్ సర్కార్​కు ఉపశమనం లభించింది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినట్టే భావించాలని న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో వాటికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది.

Read Also: Air India: ఎయిర్‌ ఇండియా సేవలపై అసహనం వ్యక్తం చేసిన కమెడియన్‌ వీర్‌ దాస్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

📢 For Advertisement Booking: 98481 12870