हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

SSC Public Exams 2025: పదో తరగతి పరీక్షలకు కీలక సూచనలు

Sharanya
SSC Public Exams 2025: పదో తరగతి పరీక్షలకు కీలక సూచనలు

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా, పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని నియంత్రణ చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పదో తరగతి పరీక్షలకు కీలక సూచనలు

పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమై ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,36,225 మంది బాలురు, 3,13,659 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల కోసం మొత్తం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీటి సౌకర్యంతో పాటు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. భద్రత కట్టుదిట్టం పరీక్షా కేంద్రాల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షించనున్నాయి. అలాగే 163 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది నుండి పరీక్షా కేంద్రాలను మొబైల్ రహితంగా నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మాత్రమే కాకుండా, విద్యా సంస్థల సిబ్బంది, ఇన్‌విజిలేటర్లు కూడా మొబైల్ ఫోన్లు వాడేందుకు అనుమతి లేదు. అయితే, చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రమే మొబైల్ ఫోన్ వాడే అవకాశం ఉంటుంది. అలాగే, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అయిన ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ట్యాబ్‌లు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ వంటి వాటిని పరీక్షా కేంద్రాల్లో అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి ఒక్క విద్యార్థికి తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు

భిన్న భాషలలో పరీక్షలు

ఈ ఏడాది విద్యార్థులు ఎన్‌సీఈఆర్టీ (NCERT) సిలబస్‌తో పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షలకు హాజరయ్యే 6.49 లక్షల మంది విద్యార్థుల్లో, వివిధ భాషల్లో పరీక్షలు రాయనున్న విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి తెలుగు మీడియం – 51,069 మంది , ఒడియా – 838 మంది , తమిళం – 194 మంది, కన్నడ – 623 మంది, హిందీ – 16 మంది, ఉర్దూ – 2,471 మంది ఇతర విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యార్థులు కూడా ఈరోజు నుంచే పరీక్షలు రాయనున్నారు.

విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ను చూపించి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారుల సమన్వయంతో అన్ని జిల్లాల్లో నియంత్రణ చర్యలు తీసుకున్నారు.

విద్యార్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ శుభాకాంక్షలు

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. టెన్త్‌ పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలక మైలురాయిగా నిలుస్తాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులకు అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఈ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..
0:36

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

📢 For Advertisement Booking: 98481 12870