తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానిక భక్తులకు ప్రత్యేక దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తుంది. ఈ నెల 2న కూడా ఈ కోటా ప్రకారం దర్శన టోకెన్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. తిరుపతిలో మహతి ఆడిటోరియం కౌంటర్లలో, తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్లు జారీ చేయనున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం అనే విధానంలో ఈ టోకెన్లు ఉదయం 5 గంటల నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తాయి.

టోకెన్ పొందే విధానం
ఈ టోకెన్లు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. భక్తులు టోకెన్లు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి.
ఒక వ్యక్తికి ఒకే టోకెన్ మాత్రమే జారీ అవుతుంది. టోకెన్ల జారీ పూర్తయిన తర్వాత ఎటువంటి అదనపు టోకెన్లు మంజూరు చేయరు
తిరుమలలో భక్తుల రద్దీ వివరాలు
తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పూర్తవడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.
దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 52,731 ,తలనీలాలు సమర్పించిన భక్తులు: 17,664
హుండీ ఆదాయం: రూ. 3.24 కోట్లు
భక్తులకు టీటీడీ సూచనలు
శ్రీవారి దర్శనానికి ముందస్తు ప్రణాళికతో రావడం ఉత్తమం. బారి రద్దీ వల్ల భక్తులకు కొన్ని అసౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి పట్టుదలతో వేచిచూడాలి. స్వామివారి సేవ కోసం భక్తులు భద్రతా నిబంధనలను పాటించాలి. తిరుమల దర్శనానికి సంబంధించి మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి లేదా టీటీడీ హెల్ప్లైన్ను సంప్రదించండి.