हिन्दी | Epaper

Pak : పాకిస్థాన్‌తో గూఢచర్యం.. మరో యూట్యూబర్ అరెస్ట్..!

Sudheer
Pak : పాకిస్థాన్‌తో గూఢచర్యం.. మరో యూట్యూబర్ అరెస్ట్..!

పాకిస్థాన్‌(Pakistan)కు గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై పంజాబ్‌లో మరో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జాన్ మహల్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జస్బీర్ సింగ్‌(Jasbir Singh Arrest)ను భద్రతా శాఖ అరెస్టు చేసింది. ఇతడి ఛానెల్‌కు 1.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలను చర్చకు తీసుకొచ్చే జస్బీర్‌ ఆన్‌లైన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూట్యూబర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.

జ్యోతి మల్హోత్రా కేసులో అతనికి సంబంధాలు

అయితే ఇటీవల పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో అతనికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. జ్యోతి అరెస్టయ్యాక తన మొబైల్ నుంచి కీలక సమాచారం డిలీట్ చేసేందుకు జస్బీర్ ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాక, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకి సమాచారం అందిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీర్ అలియాస్ జుట్ రాంధావాతో కూడా జస్బీర్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పాకిస్థాన్‌కు సంబంధించి కీలక సమాచారం

జస్బీర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని రూపనగర్ జిల్లా మహలాన్ గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్‌కు సంబంధించి కీలక సమాచారం వెలికితీసి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరించేందుకు ప్రయత్నించాడన్న అభియోగాలపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో యూట్యూబ్ వంటి వేదికల్ని గూఢచర్యానికి వాడుకుంటున్న ముఠాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also : TTD: లడ్డూ కేసులో వెలుగులో కీలక అంశాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870