మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీలో వరుసగా ఆరు మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచి, తమ సత్తాను మరోసారి నిరూపించింది.గత సీజన్లో RCB తన చివరి మ్యాచ్లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్పై కన్నేసింది. నిన్న గుజరాత్తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
Read Also: Badminton: రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్

ప్రధాన బ్యాటర్లు విఫలమవ్వడం
ఈ సీజన్ లో (RCB) ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న బెంగళూరు.. రెండో దఫాకూడా గుజరాత్ జెయింట్స్ను ఓడించింది.. 178 పరుగుల ఛేదనలో సయాలీ సత్ఘరే(21 -3) విజృంభణతో గుజరాత్ టాపార్డర్ కుప్పకూలింది. ప్రధాన బ్యాటర్లు విఫలమవ్వడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 117కే పరిమితమైంది. 61 పరుగుల తేడాతో జయభేరి మోగించిన మంధాన బృందం, ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: