టీ20 ప్రపంచకప్(T20WorldCup) టోర్నమెంట్లో భాగంగా ఒమన్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ సోమవారం శ్రీలంకలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒమన్ జట్టు బ్యాటింగ్కు దిగింది.
Read Also:T20 World Cup: పాకిస్తాన్ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ ఫైర్

ఈ మ్యాచ్లో(T20WorldCup) ఇరు జట్లు తమ టోర్నమెంట్ ఆశలను నిలుపుకోవాలంటే గెలుపు ఎంతో కీలకం. ఒమన్ జట్టు దూకుడు బ్యాటింగ్తో భారీ స్కోర్ సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, జింబాబ్వే బౌలర్లు ప్రారంభంలోనే వికెట్లు పడగొట్టి ఆధిక్యం సాధించాలని చూస్తున్నారు. శ్రీలంక పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో, ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు ఈ పోరును ఆసక్తిగా చూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: