2026 టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) పై నెలకొన్న అనిశ్చితి పై, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టత ఇచ్చింది. టోర్నమెంట్ను పాకిస్థాన్ బహిష్కరిస్తుందనే ఊహాగానాలకు చెక్ పెడుతూ, తమకు ప్రపంచకప్ నుంచి వైదొలిగే ఆలోచనే లేదని, బోర్డు స్పష్టం చేసింది..బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా తమ గ్రూప్ దశ మ్యాచ్లను భారతదేశంలో ఆడటానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది.
Read Also: Litton Das: T20 వరల్డ్కప్పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

బంగ్లాదేశ్ తమ నిర్ణయాన్ని ఐసీసీకి ఇవాళ తెలియచేయాల్సిఉంది
బంగ్లాదేశ్ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే ఐసీసీ భారత వేదికల వద్ద ముప్పు తక్కువగా ఉందని తేల్చింది. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే, పాయింట్ల నష్టం, ఆర్థిక జరిమానా వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనవరి (ఈరోజు) 21 సాయంత్రం 6.30 గంటలలోపు బంగ్లాదేశ్ తమ నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేయాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: