ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 (T20 WC) అంశంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి యూటర్న్ తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముందుగా ఈ టోర్నీలో భారత్లో ఆడకూడదనే బాయ్కాట్ నిర్ణయం పూర్తిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆటగాళ్లదేనని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు.
Read Also: T20 WC: పాక్ యూటర్న్ పై డానిష్ కనేరియా ఏమన్నారంటే?
ఈ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంది
మంగళవారం నాడు ఆసిఫ్ నజ్రుల్ మీడియాతో మాట్లాడుతూ “దేశ గౌరవాన్ని కాపాడేందుకు బీసీబీ, ఆటగాళ్లు ఈ త్యాగం చేశారు. వారే ఈ నిర్ణయం తీసుకున్నారు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. “ఈ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంది. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ గందరగోళంపై నా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నాను” అని నజ్రుల్ తెలిపారు. “ప్రపంచకప్ ఆడకూడదనేది ప్రభుత్వ నిర్ణయమని నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.

భారత్లో తమకు భద్రతపై ఆందోళనలు ఉన్నాయని, తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ తొలుత ఐసీసీని కోరింది. ఐసీసీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నారు. అయితే, టోర్నీ నుంచి వైదొలిగినందుకు బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక లేదా ఇతర ఆంక్షలు విధించబోమని ఐసీసీ హామీ ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: