Shoaib Akhtar: భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో తీవ్ర కలకలం నెలకొంది. కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాకిస్తాన్ జట్టు మరోసారి విమర్శల పాలైంది. ఈ ఓటమిపై మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
Read Also: Jasprit Bumrah : బుమ్రా మాస్టర్ ప్లాన్తో పాక్ షాక్, విజయం రహస్యం ఏమిటి?
నమీబియాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి
అసమర్థుల చేతిలో బోర్డు ఉంటే ఇలాగే ఉంటుందని తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో యూటర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను భారత టీవీ ఛానెళ్లు వక్రీకరించాయని ఆరోపిస్తూ వివరణ ఇచ్చాడు. ఓ పాకిస్థానీ వార్తా సంస్థతో మాట్లాడిన అక్తర్.. “నేను మొహ్సిన్ నఖ్వీని అసమర్థుడని అనలేదు. అంతర్జాతీయ క్రికెట్ను నడిపిస్తున్న ఉన్నతాధికారుల గురించి ఆ మాట అన్నాను. మొహ్సిన్ భాయ్ చాలా మంచి వ్యక్తి, పాక్ క్రికెట్కు సేవ చేయాలని తపిస్తున్నాడు.

కానీ ఆయన చుట్టూ ఉన్నవారు సరైన సలహాలు ఇవ్వడం లేదు” అని సర్దిచెప్పుకొచ్చాడు. 15న కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. ఈ ఓటమితో పాక్ జట్టు సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్లలో పాక్పై భారత్ 8-1 ఆధిక్యంతో తిరుగులేని రికార్డును కొనసాగిస్తోంది. టోర్నీలో ముందడుగు వేయాలంటే పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్లో నమీబియాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: