sanju samson : India national cricket team – New Zealand national cricket team మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి పోరుకు వేదిక సిద్ధమైంది. కేరళలోని Greenfield International Stadiumలో నేడు జరిగే మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా స్థానిక ఆటగాడు Sanju Samson సొంతగడ్డపై ఆడనున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఉత్సాహం మరింత పెరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ Shashi Tharoor స్పందిస్తూ, “సొంత ప్రేక్షకుల మధ్య సంజూ ఎలా ఆడతాడో చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఇది అతని కెరీర్కు కీలక మ్యాచ్” అని తెలిపారు. స్టేడియంలోని టికెట్లు పూర్తిగా అమ్ముడవ్వడం సంతోషకరమని, టీమిండియాకు మద్దతుగా తాను కూడా మ్యాచ్కు హాజరవుతానని చెప్పారు.
Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

ఇటీవల ఫామ్ కోల్పోయిన సంజూ ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లలో కేవలం 40 పరుగులే చేశాడు. రాబోయే టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్లో రాణించడం అతనికి అత్యవసరం. గత మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో, ఈసారి గెలిచి సిరీస్ను విజయంతో ముగించాలని జట్టు పట్టుదలగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: