గోట్ టూర్లో భాగంగా భారత్కు వచ్చిన ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటన నేటితో ముగియనుంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ పర్యటనకు ఇవాళ్టితో ముగింపు పలకనున్నారు. మెస్సీ (Lionel Messi) పర్యటన సందర్భంగా క్రీడాభిమానులతో పాటు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషంగా మారింది.
Read Also: Squash World Cup 2025: స్క్వాష్ వరల్డ్ కప్లో భారత్ విజయం

సినీ, క్రీడా ప్రముఖులతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు
ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఓ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని PM మోదీతో భేటీ అవుతారు. అనంతరం జాతీయ ఫుట్బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసంలో CJI జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులను కలవనున్నారు. 3.30pmకి ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి వెళ్లి సినీ, క్రీడా ప్రముఖులతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: