ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడిన క్రికెటర్ శ్రీశాంత్కు సంబంధించి ఒక పాత కేసు మరోసారి చర్చకు వచ్చింది. 2012లో జరిగిన ఒక ఘటనలో శ్రీశాంత్కు గాయం కావడంతో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వారి తరఫున ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద క్లెయిమ్ దాఖలు చేసింది. అయితే, ఆ క్లెయిమ్ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (United India Insurance Company) అంగీకరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు రావడంతో మళ్లీ హాట్ టాపిక్గా మారింది.2012లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన శ్రీశాంత్.. ప్రాక్టీస్ మ్యాచ్లో మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్కు దూరమయ్యారు. దీంతో ఫ్రాంచైజీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.82.80 లక్షల క్లెయిమ్ కోరింది. అయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ క్లెయిమ్ ను తిరస్కరించింది. వారి వాదన ప్రకారం.. శ్రీశాంత్ (Sreesanth) కు 2011 నుంచే కాలి వేలికి గాయం ఉంది. ఈ విషయాన్ని వారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో వెల్లడించలేదు.
గాయం, క్లెయిమ్ వెనుక కథ
ఆ పాత గాయం వల్లే శ్రీశాంత్ 2012లో ఆడలేకపోయాడని ఇన్సూరెన్స్ కంపెనీ వాదిస్తోంది. దీనికి భిన్నంగా.. రాజస్థాన్ రాయల్స్ మాత్రం కాలి వేలి గాయం ఒక సమస్య కాదని.. ఆ గాయంతో కూడా శ్రీశాంత్ ఆడాడని వాదించిది. 2012లో మోకాలికి అయిన కొత్త గాయం వల్లే అతను ఆడలేకపోయాడని, కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ తమకు చెందాలని తెలిపింది.గతంలో ఈ కేసు నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) లో రాజస్థాన్ రాయల్స్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనితో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఈ కేసును విచారించారు.

ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది
ఈ సందర్భంగా వారు కాలి వేలి గాయం గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగానే తెలియజేశారా లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఆ విషయం తెలిసి ఉంటే.. కంపెనీ అతనికి ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు లేదా అధిక ప్రీమియం వసూలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, శ్రీశాంత్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సహా ఇతర పత్రాలను సమర్పించాలని ఇన్సూరెన్స్ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పత్రాలు సమర్పించిన తర్వాత ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభిస్తారు.
ఈ జట్టు ఎప్పుడు స్థాపించబడింది?
రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ఉంది.
జట్టు హోమ్ గ్రౌండ్ ఎక్కడుంది?
రాజస్థాన్ రాయల్స్ జట్టు హోమ్ గ్రౌండ్ జైపూర్లోని సావాయి మాన్సింగ్ స్టేడియం.
Read hindi news: hindi.vaartha.com
Read also: