
Jitesh Sharma: టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాటర్ జితేశ్ శర్మ, 2026 టీ20 ప్రపంచకప్కు చివరి నిమిషంలో జట్టులో చోటు కోల్పోవడంపై తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. మెగా టోర్నీలో ఆడే అవకాశం రాకపోవడం బాధ కలిగించినప్పటికీ, తనకు అంతకంటే ముఖ్యమైన బాధ్యత ఎదురైందని ఆయన పేర్కొన్నారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Read Also: IPL 2026 Schedule Release: ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల
అవకాశాలు ఇషాన్ కిషన్ పునరాగమనం
టీ20 వరల్డ్ కప్కు ముందు జితేష్ భారత జట్టు ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. ఆసియా కప్లో కూడా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కు ముందు బ్యాటింగ్ కాంబినేషన్లో మార్పులు చేసింది. ఆ సమయంలో వికెట్ కీపర్ను టాప్ ఆర్డర్లో ఆడించాలనే వ్యూహంతో ఇషాన్ కిషన్కు అవకాశం ఇచ్చారు.
అతను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడంతో జితేష్కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు.ఈ విషయంపై స్పందించిన జితేష్ మాట్లాడుతూ “నన్ను జట్టులో ఎంపిక చేయలేదని తెలిసినప్పుడు కొద్దిగా నిరాశ కలిగింది. నేను కూడా మనిషినే. బాధపడటం సహజం. కానీ కొంత సమయం గడిచాక ఆ బాధ తగ్గిపోయింది” అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
“అదే సమయంలో నా తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారు. ఆ చివరి ఏడు రోజులు నేను ఆయనతోనే ఉన్నాను. ప్రపంచకప్ కంటే నాన్నకే నా అవసరం ఎక్కువగా ఉందని తర్వాత గ్రహించాను. ఆ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆయన చివరి రోజుల్లో సేవ చేసే భాగ్యం కలిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు” అని జితేశ్ తెలిపాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: