India T20 World Cup: భారత క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ఫార్మాట్లో మూడు దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తూ, టీమ్ ఇండియా ‘విశ్వవిజేత’గా అవతరించింది. ముగ్గురు దిగ్గజ కెప్టెన్ల సారథ్యంలో మూడు ప్రపంచకప్లను ముద్దాడి, భారత్ తన క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
Read Also: IND vs NZ T20 World Cup Final : కష్టాల్లో కివీస్
2007: ధోనీ సేన సృష్టించిన తొలి సంచలనం
అనుభవం లేని యువ జట్టు.. కొత్త కెప్టెన్.. కానీ గుండె నిండా గెలిచితీరాలన్న కసి! 2007లో సౌతాఫ్రికా గడ్డపై ఎం.ఎస్. ధోనీ నాయకత్వంలోని యువ భారత్ సృష్టించిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఫైనల్లో పాకిస్థాన్పై సాధించిన ఆ విజయం భారత క్రికెట్ గమనాన్నే మార్చేసింది. ఆనాటి జోగిందర్ శర్మ బౌలింగ్, శ్రీశాంత్ క్యాచ్ ఇప్పటికీ ప్రతి అభిమానికి గుర్తే.

2024: రోహిత్ శర్మ ఆధ్వర్యంలో 17 ఏళ్ల నిరీక్షణకు తెర
సుదీర్ఘ కాలం తర్వాత 2024లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ మళ్ళీ గర్జించింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ ఈ విజయంలో మైలురాళ్ళుగా నిలిచాయి.

2026: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సరికొత్త చరిత్ర
2026 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ను శిఖరాగ్రాన నిలబెట్టింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో, గౌతమ్ గంభీర్ వ్యూహరచనలో టీమ్ ఇండియా హ్యాట్రిక్ కొట్టింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ రికార్డులను చెరిపివేస్తూ.. అత్యధికంగా మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. సంజూ శాంసన్ విధ్వంసం, బుమ్రా బౌలింగ్ మ్యాజిక్ ఈ విజయానికి ప్రధాన బలమయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: