అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమ్ ఇండియా (Team India) మరో అరుదైన ఘనతను సాధించింది. ICC ఫుల్ మెంబర్ టీమ్పై 150+ టార్గెట్ను అత్యధిక బాల్స్ (60) మిగిలి ఉండగానే ఛేదించిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. న్యూజిలాండ్తో మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించి ఈ ఘనతను అందుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వరుసగా 11 సిరీస్లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ ఇప్పుడు అందుకుంది.
Read Also: Sunrisers Eastern Cape: SA20 లీగ్ విజేతగా సన్రైజర్స్
సరికొత్త ప్రపంచ రికార్డు
2016-18 మధ్య కాలంలో సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలోని పాక్ జట్టు ఈ ఘనతను సాధించింది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును సమం చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో కూడా భారతే ఉంది. 2017-18లో వరుసగా ఏడు, 2019-21 మధ్య ఆరు సిరీస్లు గెలిచింది.2026లో టీ20 ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో జట్టు ఈ స్థాయిలో రాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కివీస్తో మిగిలిన రెండు మ్యాచ్ల తర్వాత సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా (Team India) ఇంగ్లండ్లో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ను కూడా గెలిస్తే వరుసగా 12 విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.ఇప్పటికే స్వదేశంలో వరుసగా అత్యధిక టీ20 సిరీస్లు (10) గెలిచిన రికార్డు కూడా భారత్ పేరిటే ఉంది. గతంలో ఆస్ట్రేలియా (2006-10) ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: