అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్తో(Ind vs Pak Match) జరుగుతున్న కీలక మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ను ఆరన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీపై ఈ మ్యాచ్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు.
Read Also:Team India: T20లలో నంబర్ వన్ గా భారత్

పాకిస్థాన్ బౌలర్ల వ్యూహం
ఇక మరోవైపు, మ్యాచ్ ఆరంభంలోనే త్వరిత వికెట్లు సాధించేందుకు పాకిస్థాన్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్(Ind vs Pak Match) చేస్తున్నారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్, భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానిస్తూ బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ సూపర్ సిక్స్ మ్యాచ్ ఆదివారం బులావాయోలో జరుగుతోంది.
ప్రతీకారంపై భారత్ కన్ను
ఐదుసార్లు ప్రపంచకప్ విజేతలైన భారత్, గతంలో అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగింది. అభిమానులు ఈ హై వోల్టేజ్ పోరును ఉత్కంఠగా వీక్షిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: