IND vs ENG: భారత ఓపెనర్ సంజూ శాంసన్ తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్ను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్లో సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడిని అధిగమించి, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి భారత ఓపెనర్గా ఆయన నిలిచాడు.
Read Also: India vs England : దుమ్మురేపిన టీమిండియా..ఇంగ్లండ్ కు 254 టార్గెట్
89 పరుగులతో రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్
ఈ కీలక మ్యాచ్లో సంజూ శాంసన్ కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆయన ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. కేవలం బౌండరీల రూపంలోనే ఎక్కువ పరుగులు రాబట్టిన సంజూ, భారత జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో సంజూకు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.

కోహ్లీ 2016 రికార్డు సమం
వెస్టిండీస్తో జరిగిన గత మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన సంజూ శాంసన్.. తాజా మ్యాచ్లోనూ అదే జోరు కనబర్చాడు. దాంతో విరాట్ కోహ్లీ పేరిట గత 10 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్ను సమం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఇదే వాంఖడే మైదానం వేదికగా వెస్టిండీస్తో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ 89 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లోనూ సంజూ శాంసన్ సరిగ్గా 89 పరుగులే చేసి విరాట్ కోహ్లీ రికార్డ్ను సమం చేశాడు.
ఓవరాల్గా ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్గా సంజూ శాంసన్ నిలిచాడు. బుధవారమే సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్(34 బంతుల్లో 100 నాటౌట్) అజేయ సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్తో సంజూ శాంసన్ ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: