India vs Pakistan match : భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే మైదానంలోనే కాదు, బయట కూడా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటుంది. ఈసారి కూడా అదే దృశ్యం కనిపించింది. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్ మరియు సల్మాన్ అఘా పరస్పరం కరచాలనం (షేక్ హ్యాండ్) చేసుకోకుండా వెనుదిరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఈ రెండు జట్లు ఎదురుపడినప్పుడల్లా టాస్ సమయంలో మరియు మ్యాచ్ అనంతరం కూడా స్నేహపూర్వక కరచాలనం కనిపించకపోవడం గమనార్హం.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ నెమ్మదిగా ఉండటం, ప్రారంభ ఓవర్లలో బౌలర్లకు సహకారం లభించే అవకాశముందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే గత మ్యాచ్ తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలని చెప్పిన పాక్ కెప్టెన్ ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రేమదాస స్టేడియంలో ఛేజింగ్ జట్లకు మంచి రికార్డు ఉంది. 2021 తర్వాత జరిగిన 13 మ్యాచ్లలో 10 సార్లు ఛేజింగ్ జట్టే విజయం సాధించింది.
Read also: Municipal Election Results: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం

టాస్ ఓడిపోవడంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశ వ్యక్తం చేయలేదు. “మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. గత రెండు మ్యాచ్లలో అదే వ్యూహంతో విజయం సాధించాం. కాబట్టి మా ప్రణాళికలో మార్పు అవసరం లేదు” అని తెలిపారు. భారత్–పాక్ మ్యాచ్ ప్రత్యేకమని అంగీకరిస్తూ, ఒత్తిడిని పక్కన పెట్టి ఆటపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. మరో మార్పుగా అభిషేక్ శర్మకు అవకాశం లభించింది. పాకిస్థాన్ మాత్రం గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2014 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన 11 టీ20 మ్యాచ్లలో 10 సార్లు ఛేజింగ్ జట్టే విజయం సాధించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: